వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు

Spread the love

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓంకార్‌ నగర్‌లోని ఏషియన్‌ పేయింట్స్‌ గోదాంలో శనివారం అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలంలో మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ కమ్ముకుంది. చూస్తుండగానే మంటలు మరో మూడు ఫర్నీచర్‌ గోదాములకు మంటలు విస్తరించాయి.సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కాగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పెట్రోల్‌ బంక్‌ ఉండగా.. అదృష్టవశాత్తు దానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే సమాయానికి ఫైర్‌ ఇంజిన్‌ రాకపోవడం వల్లే మంటలు అధికంగా వ్యాపించాయని షాప్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com