హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్ ఘాట్ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం బాగ్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.52 కోట్లు, చాదర్ ఘాట్ నిర్మాణానికి రూ.42 కోట్లు మున్సిపల్ మంత్రి కేటీఆర్ చొరవతో నిధులు మంజూరయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.