ముస్తాబాద్ మండలంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.ఈక్రమంలో నామాపూర్లోని రెండు ఇండ్లలో దాచి, నిల్వ ఉంచిన 36.80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో నామాపూర్కు చెందిన కడమంచి భద్రయ్య, కడమంచి స్వామిలను అదుపులోకి తీసుకుని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లుకు అప్ప గించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై తెలిపారు. అయితే రేషన్ బియ్యాన్ని అక్రమంగా దాచి పెట్టేందుకే నిందితులు రెండు ఇళ్లను ఉపయోగించడంపై అధికారులు సైతం అవాక్కయ్యారు.