విజయవాడ: ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ఈఏపీ సెట్ ఈ నెల 4 నుంచి 12 వరకు జరిగాయి.ఇంజినీరింగ్లో 89.12 శాతం, అగ్రికల్చర్లో 95.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే క్వాలిఫయింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. కాగా, టాప్ టెన్లో 4 స్థానాలు తెలంగాణకు చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు. 3,84,000 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మొత్తం 2,82,496 మంది పరీక్షలు రాయగా, అందులో 1,94,752 మంది ఇంజినీరింగ్ పరీక్షకు, 87,744 మంది అగ్రికల్చర్ కోర్సుకు హాజరయ్యారు.