న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ధరల పెరుగుదల, జీఎస్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఇవాళ ధర్నా చేపట్టారు. రాజ్పథ్పై బైఠాయించిన రాహుల్ను పోలీసులు లాక్కెళ్లి బస్సులో ఎక్కించారు. సుమారు 30 నిమిషాల పాటు రాజ్పథ్పై రాహుల్ ధర్నా చేపట్టారు. దేశంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, మోదీ ఓ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నట్లు రాహుల్ ఆరోపించారు.