యూపీలో మంకీపాక్స్ అలర్ట్..
లక్నో: ఉత్తరప్రదేశ్లో మంకీపాక్స్ అలర్ట్ జారీ చేశారు. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆస్పత్రుల్లో.. మంకీపాక్స్ రోగుల కోసం మంచాలను రిజర్వ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.