ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి పరివాహ ప్రాంతాలు వరదలో మునిగిన సంగతి తెలిసిందే. వదర ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పటికే పరిహారం, నిత్యావసరాలను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం… వరద పరిస్థితులను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో వరద క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరుతున్నారు.
ఈ నెల 26న వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లనున్న జగన్… ఆ మరునాడు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగుతుందని ప్రాథమిక సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంతో పాటుగా వరద బాధితులతో మాట్లాడేందుకే జగన్ ఈ పర్యటనకు బయలుదేరుతున్నారు.