తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి మధ్యంతర పిటిషన్

Spread the love
  • వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ
  • విచారణ వివరాలు కోరిన అవినాశ్ రెడ్డి
  • ఆడియో, వీడియో రికార్డింగ్ లు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబధించిన వివరాలు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు.

ఈ కేసులో చివరిసారిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ గత నెల 14న హైదరాబాదులో విచారించింది. ఆ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తన మధ్యంతర పిటిషన్ లో కోర్టును కోరారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com