
- ఢిల్లీ సర్కారు లిక్కర్ పాలసీలో అక్రమాలు
- ఆరోపణలతో వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ సర్కారు
- ఆరోపణల నేపథ్యంలో సీబీఐ, ఈడీల విచారణ

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో పలు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ పాలసీని ఆప్ సర్కారు వెనక్కి తీసుకుంది. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అధికారులను, వ్యాపారవేత్తలను, రాజకీయ నేతలను విచారించారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇంచార్జి విజయ్ నాయర్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కేసులో కీలక నిందితుడు సమీర్ మహేంద్రుకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్య ఫేస్ టైమ్ వీడియో కాల్ ఆరేంజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కార్యదర్శిని అధికారులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.