
- జగనన్న తోడు పథకం నిధులు విడుదలలో ఏపీ ముఖ్యమంత్రి
- 3.95 లక్షల మంది లబ్దిదారులకు రూ.395 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడి
- ఆరు నెలలకు సంబంధించిన వడ్డీ రూ.15.17 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ

ఈ సందర్బంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.395 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వివరించారు. ఈ రుణాలకు సంబంధించి చిరువ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందని, ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
గత ఆరునెలల వ్యవధిలో ఈ పథకం కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి వడ్డీ రూ.15.17 కోట్లను రీఎంబర్స్ మెంట్ చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఈ పథకానికి సంబంధించి రుణాలను సకాలంలో చెల్లించిన 13.28 లక్షల మందికి రూ. 63 కోట్లకు పైగా వడ్డీ తిరిగి చెల్లించామన్నారు. చిరువ్యాపారులు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మెచ్చుకున్నారు. జగనన్న తోడు పథకం అందని చిరువ్యాపారులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.